తెరాస ఆవిర్భావ సభకు ముస్తాబైన ఆర్మూర్
నిజామాబాద్, జనంసాక్షి: తెరాస ఆవిర్భావ సభకు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో పార్టీ నేతలు విస్తృత ఏర్పాట్లు చేశారు. సభకు భారీ వేదికను సిధ్దం చేశారు. సుమారు 45 ఎకరాల ప్రాంగణంలో ,2లక్షల చదరపు అడుగుల విస్తీర్ణ్లంలో ప్రతినిధులు కూర్చోవడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. 10 జిల్లాల నుంచి భారాగా కార్యకర్తలు, నేతలు ఈ సభకు హాజరుకానున్నారు.