తెరాస యువజన విభాగం అధ్యక్షులు డాకొల్ల ఆంజనేయులు గౌడ్ కు పిత్రు వియోగం.

దౌల్తాబాద్ ఆగష్టు 2, జనం సాక్షి.
దౌల్తాబాద్ మండల కేంద్రంలో గ్రామానికి చెందిన తెలంగాణ రాష్ట్ర సమితి యువజన విభాగం పట్టణ అధ్యక్షులు వాళ్ల తండ్రి డాకోళ్ల బాగ గౌడ్ గుండెపోటుతో మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి మండల పార్టీ అధ్యక్షులు రణం శ్రీనివాస్ గౌడ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంటి పెద్దదిక్కు కోల్పోవడం చాలా బాధాకరమని వారి కుటుంబానికి మనో ధైర్యన్ని చెప్పారు.ఈ కార్యక్రమంలో గౌడ సంఘంసభ్యులు,తదితరులు పాల్గొన్నారు.