తెలంగాణకు మరో భారీ పెట్టుబడి

` హైదరాబాద్‌లో రూ. 10,500 కోట్లతో ఏఐ డేటా సెంటర్‌ క్లస్టర్‌ ఏర్పాటు
` సంయుక్తంగా ఏర్పాటు చేయనున్న ఎన్‌టీటీ- డేటా, నెయిసా సంస్థలు
` టోక్యోలో సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో సంస్థల ప్రతినిధులతో ఒప్పందం
` మరోవైపు రుద్రారంలో రూ.562 కోట్లతో మరో పరిశ్రమ ఏర్పాటుకు తోషిబా డీల్‌
` జపాన్‌ పర్యటనలో రెండో రోజూ భారీ పెట్టుబడులు
` హైదరాబాద్‌ అభివృద్ధికి టోక్యో నుంచి చాలా నేర్చుకున్నానన్న: సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్‌(జనంసాక్షి):జపాన్‌ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి బృందం హైదరాబాద్‌లో భారీ పెట్టుబడులను సాధించింది. రూ. 10,500 కోట్లతో ఏఐ డేటా సెంటర్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఎన్‌టీటీ- డేటా, నెయిసా సంస్థలు సంయుక్తంగా ఈ డేటా సెంటర్‌ క్లస్టర్‌ను ఏర్పాటు చేయనున్నాయి. టోక్యోలో సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో తైప్రాక్షిక ఒప్పందాలపై ప్రభుత్వ అధికారులు, సంస్థల ప్రతినిధులు సంతకాలు చేశారు. మరోవైపు రుద్రారంలో రూ.562 కోట్లతో మరో పరిశ్రమ ఏర్పాటుకు తోషిబా ఒప్పందం చేసుకుంది. సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలోనే తోషిబా అనుబంధ సంస్థ టీటీడీఐ ప్రతినిధులు ఎంవోయూపై సంతకాలు చేశారు. విద్యుత్‌ సరఫరా, పంపిణీ రంగంలో పెట్టుబడులు, ఆవిష్కరణలకు ఈ ఒప్పందం జరిగింది. రుద్రారంలో ఇప్పటికే ఈ సంస్థ రెండు ఫ్యాక్టరీలను నిర్వహిస్తోంది. ఈ భారీ పెట్టుబడులపై సీఎం రేవంత్‌ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. నమ్మకమైన, నాణ్యమైన విద్యుత్‌ సరఫరాతో పెట్టు-బడులు వస్తున్నాయి. తెలంగాణలో సింగిల్‌ విండో అనుమతులను ప్రభుత్వం ఇస్తోంది. నిపుణులు ఉన్నందున ఏఐ డిజిటల్‌ సేవల్లో తెలంగాణ అగ్రగామిగా నిలుస్తోంది. ఎన్‌టీటి భారీ పెట్టుబడులతో డేటా సెంటర్‌ హబ్‌గా హైదరాబాద్‌ స్థానం సుస్థిరంగా ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. డిజిటల్‌ ట్రాన్స్ఫర్మేషన్‌, ఐటీ సర్వీసుల్లో ప్రపంచంలో పేరొందిన ఎన్‌టీటీ- డేటా, అర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫస్ట్‌ క్లౌడ్‌ ప్లాట్‌ఫాం సంస్థ నెయిసా నెట్‌ వర్క్స్‌ సంయుక్తంగా హైదరాబాద్‌లో ఏఐ డేటా సెంటర్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు ముందుకొచ్చాయి. టోక్యోలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ పెట్టుబడుల ఒప్పందం కుదిరింది. దేశంలో అతిపెద్ద ఏఐ కంప్యూట్‌ మౌలిక సదుపాయం హైదరాబాద్‌లో నిర్మించబోయే ఈ సదుపాయం 400 మెగావాట్ల డేటా సెంటర్‌ క్లస్టర్‌. 25,000 జీపీయూలతో దేశంలోనే అత్యంత శక్తివంతమైన ఏఐ సూపర్‌ కంప్యూటింగ్‌ మౌలిక సదుపాయాలను సమకూరుస్తుంది. దేశంలో తెలంగాణను అర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రాజధానిగా మార్చాలనే లక్ష్యానికి అనుగుణంగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటుంది. 500 మెగావాట్ల వరకు గ్రిడ్‌, పునరుత్పాదక విద్యుత్తు మిశ్రమంతో ఈ క్లస్టర్‌ నిర్వమిస్తారు. లిక్విడ్‌ ఇమ్మర్షన్‌ వంటి అత్యాధునిక కూలింగ్‌ టెక్నాలజీలను అవలంబిస్తారు. ఈ ప్రాజెక్లును అత్యున్నత ఈఎస్‌జీ (ఎన్విరాన్‌మెంటల్‌, సోషల్‌, గవర్నెన్స్‌) ప్రమాణాలతో అభివృద్ధి చేస్తారు. ఈ క్యాంపస్‌ తెలంగాణలోని విద్యా సంస్థల భాగస్వామ్యంతో ఏఐ ప్రతిభను పెంపొందిస్తుంది. రాష్ట్ర డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్టక్చ్రర్‌ మిషన్‌కు దోహదం చేస్తుంది. ఈ భారీ పెట్టుబడుల ఒప్పందంపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని అన్నారు. నమ్మకమైన, నాణ్యమైన విద్యుత్‌ సరఫరా, సింగిలో విండో అనుమతులను ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. వీటితో పాటు రాష్ట్రంలో ప్రతిభావంతులైన నిపుణులు అందుబాటులో ఉండటంతో ఏఐ సంబంధిత డిజిటల్‌ సేవల్లో రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తుందన్నారు. ఎడబ్ల్యూఎస్‌, ఎస్‌టీటీ-, టిల్‌మన్‌ హోల్డింగ్స్‌, సీటీఆర్‌ఎల్‌ఎస్‌ వంటి పెద్ద కంపెనీల డేటా సెంటర్‌ ప్రాజెక్టుల వరుసలో ఎన్‌టీటీ భారీ పెట్టుబడుల ఒప్పందంతో దేశంలో ప్రముఖ డేటా సెంటర్‌ హబ్‌ గా హైదరాబాద్‌ స్థానం మరింత బలపడిరదని అన్నారు. టోక్యోలో ప్రధాన కార్యాలయం కలిగిన ఎన్‌టీటీ- డేటా, ఐటీ సేవలు, డేటా సెంటర్లు, డిజిటల్‌ ట్రాన్స్ఫర్మేషన్‌ లో పేరొందిన కంపెనీ. 50 కంటే ఎక్కువ దేశాల్లో 193,000 మంది ఉద్యోగులతో, ప్రపంచంలోని టాప్‌ 3 డేటా సెంటర్‌ ప్రొవైడర్లలో ఈ కంపెనీ ఒకటి. పబ్లిక్‌ సర్వీసెస్‌, బీఎఫ్‌ఎస్‌ఐ, హెల్త్‌కేర్‌, మాన్యుఫాక్చరింగ్‌, టెలికాం వంటి రంగాలకు ఈ సంస్థ సేవలు అందిస్తుంది.

తెలంగాణ స్వాగతం పలుకుతోంది..
` రాష్ట్రంలో పెట్టుబడులతో అభివృద్ధి చెందండి
` ఇండియా-జపాన్‌ ఎకనామిక్‌ పార్టనర్‌షిప్‌ రోడ్‌షోలో పారిశ్రామిక, వ్యాపారవేత్తలకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆహ్వానం
హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణలో పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చెందాలని జపాన్‌ పారిశ్రామిక, వ్యాపారవేత్తలకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆహ్వానం పలికారు. టోక్యోలోని హోటల్‌ ఇంపీరియల్‌లో జరిగిన ఇండియా-జపాన్‌ ఎకనామిక్‌ పార్టనర్‌షిప్‌ రోడ్‌షోలో తెలంగాణ రాష్ట్ర అధికారిక బృందం పాల్గొని, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించింది. వివిధ రంగాలకు చెందిన దాదాపు 150 మందికి పైగా జపాన్‌ పారిశ్రామికవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోడ్‌ షోలో మాట్లాడిన ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి జపాన్‌ పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టు-బడలు పెట్టేందుకు రావాలని సాదరంగా ఆహ్వానించారు. దేశంలోనే కొత్త రాష్ట్రం.. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న తెలంగాణ విూకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతోంది.. జపాన్‌ను ఉదయించే సూర్యుడి దేశం అని పిలుస్తారు. మా ప్రభుత్వ నినాదం ’తెలంగాణ రైజింగ్‌’. ఈ రోజు తెలంగాణ జపాన్‌లో ఉదయిస్తోంది,’ అన్నారు.టోక్యో చాలా గొప్ప నగరం. ఇక్కడి మౌలిక సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణ, ఆవిష్కరణలు అద్భుతం. జపాన్‌ ప్రజలు సౌమ్యులు, మర్యాదస్తులు, క్రమశిక్షణ కలిగినవారు. విూ నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడానికి టోక్యో నుంచి చాలా నేర్చుకున్నాను,..’ అని అన్నారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, నైపుణ్యం గల ప్రతిభ, స్థిరమైన విధానాలను ప్రజా ప్రభుత్వం అందిస్తుందని జపాన్‌ వ్యాపారవేత్తలకు మాటిచ్చారు. లైఫ్‌ సైన్సెస్‌, గ్లోబల్‌ కెపాబులిటీ- సెంటర్లు, ఎలక్టాన్ర్రిక్స్‌, ఎలక్ట్రిక్ర్‌ వెహికిల్స్‌, టె-క్స్‌టైల్స్‌, ఏఐ డేటా సెంటర్లు, లాజిస్టిక్స్‌ వంటి రంగాల్లో పెట్టు-బడులు పెట్టాలని.. భారత్‌, జపాన్‌ కలిసికట్టు-గా ప్రపంచానికి అద్భుతమైన భవిష్యత్తును నిర్మిద్దామని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో భారత రాయబారి సిబి జార్జ్‌ భారత్‌-జపాన్‌ మధ్య బలపడుతున్న ఆర్థిక సంబంధాల గురించి మాట్లాడారు. జెట్రో (జపాన్‌ ఎక్‌స్టర్నల్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌) బెంగళూరు డైరెక్టర్‌ జనరల్‌ తోషిహిరో మిజుటానీ మాట్లాడుతూ.. తెలంగాణతో సహకారాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. దేశంలోనే మొదటి నెట్‌ జీరో ఇండస్టియ్ర్రల్‌ సిటీ-గా హైదరాబాద్లో నిర్మిస్తున్న ఫ్యూచర్‌ సిటీ, దేశంలోనే అద్భుతంగా నిర్మించ తలపెట్టిన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్‌ పై ప్రచార వీడియోలను రాష్ట్ర ప్రభుత్వం ఈ వేదికపై ప్రదర్శించింది. ఎలక్టాన్ర్రిక్స్‌, అర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఎలక్ట్రిక్ర్‌ వెహికిల్స్‌, టెక్స్‌ టైల్స్‌, గ్రీన్‌ ఎనర్జీ వంటి రంగాల్లో జపాన్‌ కంపెనీలకు తెలంగాణలో పెట్టు-బడులకు ఉన్న అనుకూలతలు, అవకాశాలను రాష్ట్ర వాణిజ్య పరిశ్రమల శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్‌ రంజన్‌ వివరించారు. రోడ్‌షో తర్వాత తెలంగాణ ప్రతినిధి బృందం మరియు జపాన్‌లోని పలు దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో ముఖాముఖి సమావేశమైంది.

 

తాజావార్తలు