తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ప్రతినిధులు గా చిలుక మధుసూదన్ రెడ్డి

మల్ రెడ్డి రంగారెడ్డి

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):-తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమటీ ప్రతినిధులుగా  చిలుక మధుసూదన్ రెడ్డి మల్ రెడ్డి రంగారెడ్డి ని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి నియమించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. మధుసూదన్ రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గా పని చేసి ప్రబుత్వ వ్యతిరేక కార్యక్రమాలలో కీలకంగా పనిచేశారు. విద్యార్థి నిరుద్యోగ సమస్యల పట్ల పెద్ద ఎత్తున పోరాటం చేసి వారి సమస్యల సాధన లో క్రియాశీల పాత్ర వహించడం జరిగింది. గతంలో రేవంత్ రెడ్డి తో పాటు మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు అప్పటినుండి ఇబ్రహీంపట్నం నియోజీకవర్గంలో పార్టీ సీనియర్ నాయకులు మల్ రెడ్డి రంగారెడ్డి నాయకత్వంలో క్రియాకుచిలకంగా పనిచేశారు.తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా నియమించినందుకు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనను టిపిసిసి నూతన ప్రతినిధిగా నియమించినందుకు ఎనుముల రేవంత్ రెడ్డి కి రుణపడి ఉంటానని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ నీ గెలిపించడంలో సైనికుడు లాగా పని చేస్తానని కార్యకర్తలకు నాయకులకు ఎల్లవేళలా అండగా ఉంటానని తెలిపారు. ప్రజా సమస్యలపై నిరంతరం పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను విజయవంతం చేయడానికి కృషి చేస్తానని కేంద్రంలో బిజెపి పార్టీ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ నియంత పాలన కొనసాగిస్తున్నాయని రాబోవు ఎన్నికలలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.