తెలంగాణ పరిష్కారానికి మరికోన్ని నెలలు వేచి చూడండి: షిండే

ఢిల్లీ : గతంలో జరిగిన అఖిలపక్ష భేటీలో తెలంగాణపై చర్చించినట్లు కేంద్ర హోం శాఖ మంత్రి షిండే పేర్కొన్నారు. ప్రస్తుతం చాలామంది నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. మళ్లీ అఖిలపక్ష సమావేశం ఎప్పుడైనా జరగోచ్చు. నిన్నటి 10 జన్‌పథ్‌ సమావేశంలో కూడా తెలంగాణపై చర్చించామన్నారు. అఖిలపక్ష  సమావేశం ఎప్పుడు అవసరమనుకుంటే అప్పుడే నిర్వహిస్తాం. ఇప్పటికకే తెలంగాణపై పూర్తిస్థాయిలో చర్చించినట్లు తెలియజేశారు. చంద్రబాబు లేఖ విషయం తన దృష్టికి రాలేదన్నారు. పరిష్కారం కోసం ఇంతకాలం ఆగారు. మరికొన్ని నెలలు వేచి చూడండన్నారు.