తెలంగాణ హోలీయ దాసరి సంక్షేమ సంఘము నూతన జిల్లా కమిటీ ప్రమాణ స్వీకారం

అయిజ, జులై   (జనం సాక్షి):
గద్వాల్ జిల్లా కేంద్రంలో టిఎన్జిఓ భవనంలో సోమవారం న సాయంత్రం కాలంలో
తెలంగాణ హోలీయ దాసరి సంక్షేమ సంఘము  నూతన జిల్లా కమిటీ ప్రమాణస్వీకార మహోత్సవం కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర హోలీయా దాసరి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు టం టం జాంగీర్ , హొలియో దాసరి రాష్ట్ర ఉపాధ్యక్షులు అత్తూరు వెంకటేశు ,బేడ బుడగ జంగం హక్కుల పోరాట సమితి జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు అయిజ  అశ్వ మారెప్ప,
సంచార జాతల గద్వాల జిల్లా అధ్యక్షులు హొలీయ దాసరి ఆకుల రామచంద్ర పాల్గొన్నారు.
నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేయడం జరింది.
జోగులాంబ గద్వాల జిల్లాలో హోలీయ దాసరి నూతన జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది.
జిల్లా గౌరవ అధ్యక్షులుగా చెరుకుపల్లి వేణుగోపాల్,
 జిల్లా అధ్యక్షులు  చెన్నంశెట్టి కృష్ణ,
జిల్లా ప్రధాన కార్యదర్శి  ఉప్పు అంజి,జిల్లా కోశాధికారి పిన్నం మాన్యంకొండ,జిల్లా ఉపాధ్యక్షులు.చెరుకుపల్లి జమ్మన్న,వాటం జయరాం, మద్ది విజయ్,చెరుకుపల్లి వెంకటేష్ మరియు జిల్లా ప్రచారకార్యదర్శి బొల్లు రాజశేఖర్,చెరుకుపల్లి రాజు సంయుక్త కార్యదర్శులు దొనాధుల పెద్ద వీరేష్,వాటం గోపాల్,ఉప్పు వీరేష్ సలహాదరులు పిన్నం చిన్న వీరన్న కార్యవర్గ సభ్యులు ఉప్పు జమ్మన్న మద్ది నాగరాజు,మద్ది ఉరుకుందు, చెరుకుపల్లి వెంకటరాముడు వీరిని ఎన్నుకోవడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు జాంగీర్  మాట్లాడుతూ
తెలంగాణ రాష్టం లో మన హోలీయా దాసరులు చాలా వెనకబడి వున్నారు మనకు ప్రభుత్వం నుండి ఎటువంటి పతకాలు అందకుండా వున్నవి కాబట్టి మనం అందరం కలిసి కట్టుగా వుంటూ కులం లో వెనకబడి న వారిని కి సహాయ సహకారాలు అందిస్తూ కులాన్ని అభివృద్ధి పతంలో నడిపించాలి అని విన్నవించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో హోలియ దాసరి బేడ బుడగ జంగం హక్కుల పోరాట సమితి సంచార జాతుల నాయకులు తదితరులు పాల్గొన్నారు.