తెలుగు ముదిరాజ్ ల ఆత్మీయ సమ్మేళనాన్ని జయప్రదం చేయండి

అయిజ,జులై 22 (జనం సాక్షి):
అయిజ మున్సిపాలిటీ లోని తెలుగు పేటలో ఈరోజు జరిగిన సమావేశం తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి కబీర్దాస్ నర్సింహులు పాల్గొని వారు.
మాట్లాడుతూ తెలుగు ముదిరాజ్ ఐక్యత కోసం జిల్లాలోని ప్రతి గ్రామంలో కులస్తులు ఏకం కావాలని పిలుపునివ్వడం జరిగింది.
స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న తెలుగు ముదిరాజ్ యొక్క పరిస్థితులు దీనావస్థగా ఉన్నాయి.
విద్యాపరంగా ఆర్థికపరంగా వెనక పడడమే కాక సమాజ సిద్ధమైన వనరుల మీద హక్కులు ఉన్న వాటి యొక్క ఫలాలను పొందలేకపోతున్నాం.
 కావున జిల్లాలోని తెలుగు ముదిరాజులు ఏకమై మన హక్కులు సాధించేదాకా పోరాడాలని పిలుపునివ్వడం జరిగింది.
ఈనెల 24 ఆదివారం ఉదయం 10. గంటల కు  జిల్లా కేంద్రంలోని రెండో రైల్వే గేట్ దగ్గర తెలుగు ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ స్థలం దగ్గర జిల్లా సమ్మేళనం ఉన్నది. కావున అల్లంపూర్ నియోజకవర్గం లోని అన్ని గ్రామాల్లోని తెలుగు ముదిరాజ్ కులస్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరని మనవి.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మీసాల కృష్ణయ్య,  నెంబర్ రాముడు, టిఎన్ఆర్ జగదీష్ , భీమన్న , శిల్పాబాద్ మోహన్ , చంద్రశేఖర్, టి. గోవిందు ,రమేష్ రాజేష్ ,యుగేందర్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area