త్యాగానికి ప్రతీకగా మొహరం

ఝరాసంగం ఆగస్టు 9 (జనంసాక్షి)త్యాగానికి ప్రతీకగా నిర్వహించే మొహరం  పురస్కరించుకుని సి డి సి ఛైర్మన్ ఉమాకంత్ పాటిల్ సర్పంచ్ ఓం ప్రకాష్ పాటిల్ ఏల్గోయి గ్రామంలో పీర్లను దర్శించుకున్నారు. మంగళవారం పేర్ల దేవుళ్లకు నిర్వహించే ప్రార్థనలో పాల్గొన్నారు. పీర్ల సందర్శన సందర్భంగా  నిర్వాహకులు పూలమాల శాలువా తో  ఘనంగా సత్కరించారు. అధర్మాన్ని అన్యాయాన్ని వ్యతిరేకించి ధర్మం దిశగా ప్రతి ఒక్కరూ నడిచి సుఖ సంతోషాలతో ఉండాలని మహమ్మద్ ప్రవక్త ఆశించారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు కుల మత వర్గ బేధాలు లేకుండా అన్ని వర్గాల వారికి తాను అందుబాటులో ఉంటానని ఆయన చెప్పారు మహమ్మద్ ప్రవక్త దయవల్ల నియోజకవర్గంలోని ప్రజలకు అందుబాటులో ఉండి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో  ఎంపిటిసి విజేందర్ రెడ్డి తదితరులు
పాల్గొన్నారు.