దంచికోట్టిన వాన అలుగు పారిన చెరువులు

 చెరువులను పరిశీలించిన ఎంపీపీ, తహశీల్దార్, ఎంపిడిఓ
ఎటుచేసిన జలసవ్వడి
శివ్వంపేట జూలై 23 జనంసాక్షి :
శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం తెల్లవారుజాము వరకు ఏకబిగి దంచికోట్టిన వర్షానికి మండలంలోని అన్ని గ్రామాల చెరువులు, కుంటలు నిండి జలకళ సంతరించుకున్నాయి. మరీ కొన్ని గ్రామాల్లో చెరువులు, కుంటలు పూర్తి స్థాయి లో నిండిపోయి, అలుగు పారాయి. దీంతో మండల వ్యాప్తంగా  ఎడతెరిపి లేకుండా కురిసిన  వర్షాలకు వాగులు, వంకలు నీటితో పొంగి ఎటు చూసినా జల సవ్వడి కన్పించడం జరిగింది. ఈ ఖరీఫ్ సీజన్ లో రైతులు సాగు చేసిన పంటలన్నీ వర్షపు నీటితో నిండిపోయి పొలాలన్నీ చెరువులుగా కనిపించాయి. మండలంలో నిండిన చెరువులను,కుంటలను ఎంపీపీ కల్లూరి హరికృష్ణ,తహశీల్దార్ శ్రీనివాస్ చారి, ఎంపిడిఓ నవీన్ కుమార్ పరిశీలించారు. ఎదుల్లాపూర్, దొంతి, బిజిలిపూర్, నవాబ్ పేట, పెద్దగొట్టిముక్కల, చెంది, చిన్నగొట్టిముక్కల, లింగోజీ గూడ చెరువులు నిండి అలుగులు పరుతున్నాయి. ఇంకా కొన్ని గ్రామాల చెరువులు  నిండి అలుగుకు పారడానికి కొన్ని నీళ్లు తక్కువగా ఉన్నాయి. ఎన్నో ఎండ్లకు మాగ్రామంలో చెరువు నిండిందని ఆయా గ్రామల రైతులు, యువకులు అలుగు పారుతున్న చెరువుల వద్దకు వెళ్లి సంతోషం వ్యక్తం చేశారు.