దండోరా జెండా రెపరేపలాడింది.

జనంసాక్షి న్యూస్ నెరడిగొండ:
మాదిగల స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అదేవిధంగా మందకృష్ణ మాదిగ జన్మదిన సందర్భంగా గ్రామ స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు ప్రతి ఎమ్మార్పీఎస్ నాయకులు అభిమానులు కార్యకర్తలు గురువారం రోజున దండోరా జెండాను రెపరేపలాడే విదంగా ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చేపట్టే వరకు మాయొక్క నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు గజ్జల అశోక్ లసమన్న కరుణాకర్ మోహన్ ప్రకాష్ సతీష్ మహేందర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area