దళితులపై దాడులు నిలువరించడంలో ..
– కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం
ఫొటో ఉంది
హత్నూర (జనం సాక్షి)
ఎస్సీ,ఎస్టీ,మైనారిటీలపై జరుగుతున్న కులహత్యలు, మత విద్వేషాలను నిలువరించడంలలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు గందగల్ల ప్రసాద్ అన్నారు.రాజస్తాన్ లోని సరస్వతీ విద్యా మందిర్ పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడి కులోన్మాదానికి బలైన దళిత విద్యార్థి మృతికి నిరసనగా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం హత్నూర మండల వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఉన్నత వర్గాల ఉపాధ్యాయుల కోసం ఏర్పాటు చేసిన మంచి నీళ్ళ కుండలో నీళ్ళు తాగిన దళిత విద్యార్థిని దారుణంగా కొట్టి చంపడం అన్యాయమన్నారు. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులను చట్టరిత్యా కఠినంగా అమలు చేయకపోవడం వల్లనే కులోన్మాదులు బరితెగించి దళితులపై దాడులకు ఎగబడుతున్నారని వారు ఆరోపించారు.కుల హత్యకు గురైన విద్యార్థి కుటుంబాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదుకుని విద్యార్థి మృతికి కారణమైన ఉపాధ్యాయుడిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ యువసేన జిల్లా కన్వీనర్ కోటగళ్ల శివరామకృష్ణ, గందగల్ల వీరయ్య,నవీన్ కుమార్,మొగులయ్య, ఎల్లయ్య,సాలోమన్ తదితరులు ఉన్నారు.
