దసరా ఉత్సవ కమిటీ నుంచి ఇద్దరి తొలగింపు

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 18(జనం సాక్షి)
వరంగల్ నగరంలోని అండర్ రైల్వే గేట్  ఉరుసు కరీమాబాద్ దసరా ఉత్సవ కమిటీ కార్యవర్గం నుంచి ప్రధాన కార్యదర్శి బండి కుమార్ స్వామి, కోశాధికారి మండ వెంకన్న గౌడ్ లను  తొలగించినట్లు ఉత్సవ కమిటీ తెలిపింది. ఈ మేరకు అధ్యక్షులు నాగపురి సంజయ్ బాబు అధ్యక్షతన ఆదివారం ఆదర్శ ట్రస్ట్ భవన్ లో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. గత కొంతకాలంగా ఉత్సవాలకు దూరంగా ఉంటూ కమిటీ సమావేశాలకు హాజరు కాకపోవడం వల్ల బండి కుమారస్వామిని, మండ వెంకన్న గౌడ్ లను తొలగించినట్లు పేర్కొన్నారు. నూతనంగా ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శిగా మేడిది మధుసూదన్, ఉత్సవ కమిటీ ట్రస్ట్ అధ్యక్షునిగా వంగరి కోటి, కోశాధికారిగా వేలిదే శివమూర్తులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు దసరా ఉత్సవ కమిటీ అధ్యక్షులు నాగపురి సంజయ్ బాబు తెలిపారు. అలాగే గౌరవ సభ్యులుగా మండ వెంకన్న గౌడ్ ను కొనసాగిస్తున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో ఉత్సవ కమిటీ బాధ్యులు ఒగిలిశెట్టి అనిల్, మేడిది మధుసూదన్, గోనే రాంప్రసాద్, రంజిత్, సుంకరి సంజీవ్, అజయ్, గోవర్ధన్, చిరంజీవి, రాజు, వెంకటేశ్వర్లు  అశోక్ తదితరులు పాల్గొన్నారు