దాడి కేసులో 11మంది అరెస్ట్‌

న్యూఢిల్లీ,ఆగస్ట్‌14(జ‌నం సాక్షి): కన్వరియా యాత్రలో భాగంగా ఆగస్టు 7న మోతీనగర్‌లోని ఒక వాహనంపైఒక బృందం విధ్వంసాన్ని సృష్టించగా, ఈ ఘటనతో సంబంధం ఉన్న తొమ్మిది మందిని మంగళవారం ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటి వరకు ఈ కేసులో మొత్తం 11 మందిని అరెస్టు చేశారు. ఆరోజు యాత్రలో పాల్గొంటున్న కన్వరియాలు రోడ్డు వెంట వెళతున్న కారు డ్రైవర్‌ను అడ్డగించి, కారును ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు హింసాకాండ, చట్టాలను ఉల్లంఘించేవారిని ఉపేక్షించవద్దని, కఠినచర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.