దేశంలో ఎక్కడినుంచైనా లావాదేవీలు
ఖమ్మం, నవంబర్ 3 : దేశలో ఎక్కడినుంచైనా ఎస్బిహెచ్ ఖాతాలకు సంబంధించి లావాదేవీలను దేశంలో ఎక్కడినుండైనా ఎస్బిహెచ్ పరిధిలోని బ్యాంకుల్లో నిర్వహించుకోవచ్చని ఎస్బిహెచ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కృష్ణమోహన్ తెలిపారు. గతంలో కొంతవరకు మాత్రమే ఈ పరిధి ఉండేదని, ఇప్పుడు ఆ సమస్య లేదని అన్నారు. ఖమ్మం రీజియన్ పరిధిలో ఇప్పటివరకు ఎనిమిది కోట్ల రూపాయలను డిపాజిట్ల రూపంలో సేకరించడం జరిగిందని అన్నారు. వివిధ పథకాల కింద వెయ్యి కోట్ల రూపాయలను రుణాల కింద అందజేశామని అన్నారు. స్వచ్ఛమైన బంగారాన్ని కూడా వినియోగదార్లకు నాణేల రూపంలో అందిస్తున్నామని అన్నారు. బంగారు వస్తువులపై గ్రాము రెండు వేల రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుందని అన్నారు.