దేశభక్తితో జాతీయ గీతం ఆలపించిన మండల ప్రజలు
రుద్రంగి ఆగస్టు 16 (జనం సాక్షి)
ఉప్పొంగిన దేశభక్తి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 11:30 నిమిషాలకు రుద్రంగి మండల
కేంద్రంలోని అంబెడ్కర్ చౌక్ ఇందిరా చౌక్ గ్రామ పంచాయతీ ఆవరణలో జాతీయ గీతం అలపించడానికి మహిళలు విద్యార్థులు ప్రజాప్రతినిధులు అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ గీతం ఆలపించారు.ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ…ప్రతి ఒక్కరు దేశ భక్తిని చాటే విదంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ స్వతంత్ర వజ్రోత్సవాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు.చిన్న పెద్ద తేడా లేకుండా ఎక్కడివారు అక్కడే నిలబడి పనులు మానుకొని దేశ భక్తితో జాతీయ గీతం ఆలపించి
దేశంపై ఉన్న భక్తిని అభిమానాన్ని చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపిపి గంగం స్వరూప మహేష్
,జడ్పిటీసీ గట్ల మినయ్య,సర్పంచ్ తర్రె ప్రభాలత మనోహర్,ఎంపిడిఓ శంకర్,ఎస్ ఐ విజయ్,
ఎంపిఓ సుధాకర్,గ్రామ ప్రజలు మహిళలు,వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.