దేశానికి స్వాతంత్రం తెచ్చిన గాంధీ సేవలు మరువరానివి

తూప్రాన్ జనం సాక్షి అక్టోబర్ 2:: దేశానికి స్వాతంత్రం కోసం పోరాటం చేసి స్వాతంత్రాన్ని తీసుకువచ్చిన మహాత్మా గాంధీ సేవలు మరువరానివని ఆల్ ఇండియా ఆర్యవైశ్య ఫెడరేషన్ రాష్ట్ర కోశాధికారి తూప్రాన్ మున్సిపల్ కౌన్సిలర్ కొడిప్యాక నారాయణ గుప్తా పేర్కొన్నారు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో అవి జిల్లా అధ్యక్షులు ఉప్పల నరసింహులు ఆర్యవైశ్య సంఘం తూప్రాన్ పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా ప్రధాన కార్యదర్శి పల్లెర్ల బాలేష్ తదితరులు పాల్గొని మహాత్మా గాంధీ గ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం తూప్రాన్ సామాజిక ఆరోగ్య వైద్య కేంద్రంలో రోగులకు పండ్లు టిఫిన్లు పంపిణీ చేశారు తూప్రాన్ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ మాజీ ఎంపీపీ గుమ్మడి శ్రీనివాస్ తూప్రాన్ పట్టణ నాయకులు ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మండల కేంద్రమైన మనోహరాబాద్ లో రాష్ట్ర సర్పంచుల పూర్వం వర్కింగ్ ప్రెసిడెంట్ మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు తూప్రాన్ మనోహర్ మండలాలలోని అన్ని గ్రామాలలో గాంధీ విగ్రహాలకు గ్రామాలకు చెందిన నాయకులు ప్రజాప్రతినిధులు ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు