దేశ పౌరులందరు జాతీయ జెండా ఎగురవేయాలి..పొన్నం నారాయణ

 నిర్మల్ బ్యూరో, ఆగస్ట్13,జనంసాక్షి,,,  స్వాతంత్య్ర అమృత్యోత్సవాలలో భాగంగా భారతీయ జనతా పార్టీ OBC మోర్చా ఆధ్వర్యంలోశనివారం జిల్లా కేంద్రంలో ని అంబేద్కర్ విగ్రహానికి శుద్ధి చేశారు. ఈసందర్భంగా ఓబిసి మోర్చా రాష్ట్ర నాయకులు పొన్నం నారాయణ గౌడ్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు స్వాతంత్య్ర సిద్దించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారత స్వాతంత్ర్య స్ఫూర్తి ని ప్రజాల్లో నింపేందుకు స్వాతంత్ర్య సమర యోధుల త్యాగాలను భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకు వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని  అన్నారు  అందులో భాగంగానే స్వాతంత్ర్య సమర యోధుల విగ్రహాలను శుద్ధి చేయడం జరిగిందని అన్నారు.దేశంలోని ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్ళల్లో, కార్యాలయంలో, జాతీయ జెండా ఎగురవేయలన్నారు.కార్యకర్తలఅందరూ మువ్వన్నెల జెండా రెపరేపలాడేలా ద్విచక్రవాహనలకు సైతం జాతీయ జెండా లను పెట్టకోవలని పిలుపునిచ్చారు అదేవిధంగా జాతీయ నాయకుల విగ్రహాలను శుద్ధి చేయాలని అన్నారు.ఈకార్యక్రమంలో ఓబీసీ మోర్చా ,జిల్లా కార్యదర్శి రాము,  నాయకులు నర్సయ్య, కిషన్,   పట్టణ   అధ్యక్షులు  పాతర్ల గణేష్,తోట సత్యనారాయణ. ఓబీసీ మోర్చా ప్రబారి,రాజేందర్,తదితరులు పాల్గొన్నారు