దేశ ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేసిన బి ఆర్ ఎస్ నాయకులపై చర్యలు తీసుకోండి.

పట్టణ సిఐ రాజేందర్ రెడ్డి కి వినతి పత్రం. బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి యు రమేష్ కుమార్.
తాండూరు డిసెంబర్ 18( జనం సాక్షి) దేశ ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులపై చర్యలు తీసుకోవాలని పట్టణ సిఐ రాజేందర్ రెడ్డి కి ఆదివారం బిజెపి శ్రేణులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతూ శనివారం తాండూర్ పట్టణం అంబేద్కర్ చౌక్ లో పట్టణ బీహార్ ఎస్ పార్టీ నాయకులు దేశ ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు వ్యవస్థ టీఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా మారారని విమర్శించారు. టిఆర్ఎస్ పార్టీ నాయకులు దేశ ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేయడం పట్ల పోలీసులు చూస్తూ ఊరుకోవడమేమిటని ప్రశ్నించారు. అనంతరం తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్లో సిఐ రాజేందర్ రెడ్డి కి వినతి పత్రం అందజేస్తూ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సాహూ శ్రీలత,నాయకులు బంటారం భద్రేశ్వర్ ,
 భారతీయ జనతా పార్టీ తాండూర్ పట్టణ శాఖ నాయకులు తదితరులు ఉన్నారు.