దొరల అరాచకాలను ఎదిరించిన వీరుడు

మాజీ జెడ్పీ చైర్ పర్సన్ తుల ఉమా
జనం సాక్షి కదలాపూర్
దొరల అరాచకాలను ఎదిరించిన వీరుడు, బహుజన రాజ్యాధికార పోరాటయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని మాజీ జెడ్పీ చైర్మన్ తులఉమా అన్నారు. కథలాపూర్ మండల కేంద్రంలో 372వ సర్దార్ పాపన్న జయంతి వేడుకల్లో భాగంగా నివాళులర్పించి అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పాపన్న గౌడ్ లాగానే మన రాష్ట్రంలో ఉన్న దొరల పాలన ను రూపుమాపాలని తెలిపారు. పాపన్న గౌడ్ తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన బహుజన రాజ్యాధికార పోరాట యోధులు అదేవిధంగా యువత రానున్న కాలంలో తెరాస పార్టీని అనగదొక్కాలని కోరారు. వేములవాడ నియోజకవర్గం బిజెపి తోనే అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షులు మల్యాల మారుతి, ముసుకు కిషోర్, అంది రాజం తదితరులు పాల్గొన్నారు