నకిలీ నెయ్యి తయారీ కేంద్రంపై పోలీసుల దాడి

ఖమ్మం,సెప్టెంబర్ 6: వేంసూర్‌ మండలం కుంచిపర్తిలో నకిలీ నెయ్యి తయారీ కేంద్రాన్ని ఆదివారం అధికారులు సీజ్ చేశారు. దీని వెనుక విజయవాడకు చెందిన ఒక ప్రముఖ కంపెనీకి సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది.ఈ దాడులల్లో పోలీసులు ఒకరిని అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేశారు. అంతేకాక 40కి పైగా నెయ్యి డబ్బాలను, యంత్ర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.