నకిలీ విత్తనాలపై సమాచారం ఇవ్వండి

అనుమతి ఉన్న దుకాణాల్లోనే కొనాలి

ఖమ్మం,జూలై6(జ‌నం సాక్షి): నకిలీ విత్తనాలను అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాధికారులు హెచ్చరించారు. రైతులు కూడా అనుమతి ఉన్న దుకాణాల్లోనే పూర్తి ఆధారాలతో విత్తనాలను కొనుగోలు చేయాలన్నారు. తరవాత జరిగే నష్టానికి ప్రభుత్వం బాధ్యత వహించదన్నారు.నకిలీ విత్తనాల విక్రయాలపై ఇప్పటికే నిఘా పెట్టామని అన్నారు. ఎక్కడైనా నకిలీ విత్తనాలు అమ్ముతు న్నారన్న సమాచారం ఉంటే వెంటనే తమకు తెలియచేయాలన్నారు. రైతుల నుంచి ఎటువంటి ఫిర్యాదు వచ్చినా స్థానిక మండల వ్యవసాయఅధికారి దృష్టికి తీసుకురమ్మని ఆదేశించాం ప్రభుత్వ అనుమతి న్న కంపెనీ విత్తనాలను మాత్రమే రషీదు తీసుకుని కొనుగోలు చేయాలన్నారు. రెండు మూడేళ్లుగా జిల్లాలో ఈ ఉదంతాలు జరుగుతున్నా విత్తన డీలర్లు, దుకాణాల నుంచి మాముళ్లు తీసుకొని వారిపై చర్యలకు వెనకాడు తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దళారులు నకిలీ విత్తనాలను తక్కువ ధరకుకొని రైతులకు ఎక్కువ ధరకు అమ్మి లక్షల్లో సొమ్మును అర్జిస్తున్నారు. రైతులకు అరువుపైన ఇస్తామని పెట్టుబడి ఖర్చు ఇస్తామని చెప్పడంతో వీటినే కొనడానికే వారు మొగ్గు చూపుతున్నారు. పలు ప్రాంతాల్లో నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నా అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి. ఈ దందా వెనక ఉన్న కీలక వక్తులెవరూ అన్నది కనుక్కోలేకపోయారు. రైతులు సమాచారం ఇస్తే తప్ప క్షేత్రస్థాయిలోని అధికారులు ఈ విత్తనాలపై పర్యవేక్షణ చేయడం లేదు.