నటుడు శశికపూర్ కు దాదాసాహేబ్ ఫాల్కే పురస్కారం ప్రదానం….

ముంబై: బాలీవుడ్ ప్రముఖ నటుడు శశికపూర్కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రదానం చేశారు. ఈ రోజు పశ్చిమ ముంబైలోని ఫృధీ థియేటర్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో శశికపూర్కు అరుణ్ జైట్లీ అందజేశారు. ఈ కార్యక్రమానికి శశికపూర్ కుటుంబ సభ్యులతో పాటు బాలీవుడ్ ప్రముఖ నటీనటులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.