నర్సంపేట జాలుబంధం కాలువ కబ్జాపై కలెక్టర్ కి ఫిర్యాదు

జనం సాక్షి: నర్సంపేట
నర్సంపేట పట్టణంలోని నేషనల్ హైవే 365 సర్వాపురంకు ఆనుకొని ఉన్న పాకాల చెరువు ఆయకట్టు జాలుబంధం కాలువను కొందరు అధికార పార్టీ ముఖ్య నాయకులు కబ్జా చేయడంతో కబ్జాకు గురైన జాలుబంధం కాలువను కబ్జాదారుల నుండి కాపాడాలని కలెక్టర్ కి వినతి పత్రం సోమవారం నాడు అందజేయడం జరిగింది కలెక్టర్ గోపి  స్పందించి మాట్లాడుతూ నర్సంపేట పట్టణానికి చెందిన జాలుబంధం కాలువను కబ్జాదారుల నుండి కాపాడి రైతులకు న్యాయం జరిగే విధంగా సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులతో మాట్లాడి చర్యలు చేపట్టి జాలుబంధం కాలువను రక్షిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
ఈకార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ , నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ తక్కళ్ళపెల్లి రవీందర్ రావు  నర్సంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బత్తిని రాజేందర్ , కాంగ్రెస్ పార్టీ నర్సంపేట మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్, ఓబీసీ వరంగల్ జిల్లా అధ్యక్షులు ఓర్సు తిరుపతి, నర్సంపేట మున్సిపల్ కౌన్సిలర్లు ఎలకంటి విజయ్ కుమార్, ములుకల వినోద-సాంబయ్య  తదితరులు పాల్గొన్నారు