నర్సాపూర్ అభివృద్ధిలో శూన్యం

 దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు
 నర్సాపూర్  అక్టోబర్ , 9,  ( జనం సాక్షి )
 నర్సాపూర్ఎమ్మెల్యే మదన్ రెడ్డి ముఖ్యమంత్రి సన్నిహితుడని చెప్పుకుంటున్నప్పటికీ ఇక్కడి ప్రజలు రెండుసార్లు గెలిపించారని ఆయన నర్సాపూర్ అభివృద్ధి చేసిందేమీ లేదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. మదన్ రెడ్డి గెలిచి ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ ఆర్ డి ఓ ఆఫీస్ కు ,ఎమ్మార్వో ఆఫీస్ కు, పిజీ కళాశాలకు సొంత భవనం లేకపోవడం శోచనీయమని అన్నారు.
 ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతాయి కాని పనులు మాత్రం గడపదాటని విమర్శించారు.
 నర్సాపూర్ కి ముఖ్యమంత్రి వచ్చిన సందర్భంగా 20 కోట్లు మంజూరు చేసినప్పటికీ ఒక్క పని కూడా పూర్తి కాలేదని ఆయన ఆరోపించారు.
 ఐదు సంవత్సరాల క్రితం డబుల్ బెడ్ రూమ్ లు పనులు ప్రారంభించి నేటికి  ఒక్కటి కూడా పూర్తి కాకపోవడం విచారకరమని అన్నారు.
 గజ్వేల్ లో మాత్రం అన్ని పనులూ అయిపోయాయని  పక్కన ఉన్న  నర్సాపూర్లో ఎందుకు పనులు కావని ప్రశ్నించారు.