నలుగురు మంత్రులకు న్యాయ సహాయం

హైదరాబాద్‌: వివాదాస్పద జీవోల జారీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న  నలుగురు మంత్రులకు న్యాయ సహాయం అందించేందుకు  ప్రభుత్వం అంగీకరించింది. మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ,సబితా ఇంద్రారెడ్డి, గీతారెడ్డి, ధర్మానలకు న్యాయ సహాయం అంధించాలని నిర్ణయం తీసుకుంది. వివాదాస్పద 26 జీవోల జారీ  అంశంలో వీరు సుప్రీంకోర్టు నుంచి నోటీసులు  అందుకున్న విషయం తెలిసిందే.