నల్లగొండలో మంత్రి జానాకు తెలంగాణ సెగ

 

నల్లగొండ, నవంబర్‌ 19 (జనంసాక్షి): రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జానారెడ్డికి తెలంగాణ సెగ తగిలింది. సోమవారం ఇంది రాగాంధీ జయంతి సందర్భంగా నల్లగొండ పట్టణంలోని పానగల్‌ ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించేం దుకు వచ్చారు. దీంతో తెలంగాణవాదులు సొంత పార్టీలోని కోమటిరెడ్డి అనుచరులు జానారెడ్డిని నిలదీశారు. తెలంగాణకు అనుకూలంగా రాజీనామా చేయాలని డిమాం డ్‌చేశారు. వెంటనే రాజీనామా చేయాలంటూ పట్టుబట్టారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి తెలంగాణ వాదులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పరిస్థితి చేజారిపోతుందని గ్రహించిన జానారెడ్డి విగ్రహానికి పూలమాల వేయకుం డా, నివాళులర్పించకుండానే వెనుదిరి గివెళ్లిపోయారు.