నల్లమట్టి ఆరోపణలపై ఎమ్మెల్యే మర్రి మౌనం వీడి స్పందించాలి.

బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం ఉమ్మడి  జిల్లా కన్వీనర్ డి.అరవింద్ చారి.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై 18(జనంసాక్షి):
గత కొన్ని రోజులుగా పత్రికా ముఖంగా సోషల్ మీడియా పరంగా ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పై అక్రమ నల్ల మట్టి తరలింపు విషయంలో చేస్తున్న ఆరోపణలపై స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి స్పందించి వివరణ ఇచ్చి ప్రతిపక్షాల, ప్రజా సంఘాల ప్రజల అనుమానాలను తీర్చి పట్టణంలో శాంతి నెలకొనేలా చూడాలని బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం ఉమ్మడి మహబూబ్ నగర్  జిల్లా కన్వీనర్ డి.అరవింద్ చారి డిమాండ్ చేశారు.సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బిసి సంఘం నాయకులు ఏర్పాటుచేసిన సమావేశంలో బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం డి.అరవింద్ చారి పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలు ఇప్పుడిప్పుడే రాజకీయంగా ముందుకు వస్తున్నారని బిజెపి నుండి టికెట్ పొంది ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి దిలీపాచారి నల్ల మట్టి విషయంలో ప్రశ్నించడం జరిగిందని,దానికిగాను అతని ఇల్లు ముట్టడిస్తామని,భౌతిక దాడులు చేస్తామని దళిత సంఘం నాయకులు ప్రత్యేకంగా మీటింగ్ పెట్టుకుని ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి దిలీపాచారిని బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. టిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేసే వారు పార్టీ నుండి ప్రతి పక్ష నాయకులను విమర్శించాలి కానీ దళిత సంఘం నాయకులు ప్రత్యేకంగా మీటింగ్ పెట్టి ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ని బెదిరించడం సమంజసం కాదని అతనికి బీసీ సంఘాలు తోడుగా ఉంటాయని అన్నారు.గతంలో ప్రతిపక్ష పార్టీలు అక్రమ నల్ల మట్టి పైన శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.అయినా ఇంతవరకు శ్వేత పత్రం విడుదల చేయలేదని గుర్తు చేశారు.స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నల్లమట్టి పైన పర్మిషన్లు లీగల్ గా ఉంటే  మీడియా ముఖంగా బహిర్గతం చేసి నాగర్ కరల్ పట్టణంలోని శాంతియుత వాతావరణం నెలకొల్పాలని అన్నారు.లేదంటే ప్రతిపక్షాలు అన్నట్లుగా ఒక తేదీని ప్రకటించి బహిర్గతంగా ప్రతిపక్షాలను పిలిచి నల్ల మట్టి పైన వివరణ ఇస్తే ఒకరిపై ఒకరు విమర్శించుకునే సమస్య ఉండదని అన్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యే మౌనం వీడి సమాధానం చెప్పకపోతే చిలికి చిలికి తుఫానుగా మారే అవకాశం ఉందని ఒకరినొకరు భారీ స్థాయిలో విమర్శించుకుని అధికార పార్టీలకు ప్రతిపక్ష పార్టీలకు ప్రజా సంఘాలకు కుల సంఘాలకు మధ్య స్నేహపూర్వకంగా ఉండే బంధాన్ని ఒకరినొకరు విమర్శించుకుని గొడవలకు దారి తీసే అవకాశం ఉందని అన్నారు. కాబట్టి స్థానిక ఎమ్మెల్యే నల్లమట్టి విషయంలో త్వరితగతిన తమ అభిప్రాయాలను బహిర్గతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా బీసీ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి రాజు గౌడ్. తెలకపల్లి మండల అధ్యక్షుడు రాజు యాదవ్. మల్లేష్ ముదిరాజ్. దివాకర్ గౌడ్. నితిన్ యాదవ్. నవీన్. శ్రీనివాస్. పరమేష్. శంకర్. రాము. భీమేష్. ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు