నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు ఈరోజు కూడా నష్టాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 209 పాయింట్లు నష్టపోయి 28,261 వద్ద, నిఫ్టీ 64 పాయింట్లు నష్టపోయి 8,571 వద్ద స్థిరపడ్డాయి. విప్రో, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, కెయిర్న్‌ ఇండియా, అంబుజా సిమెంట్స్‌, ఇన్ఫోసిస్‌ తదితర షేర్లు లాభాలు ఆర్జించాయి. ఎన్టీపీసీ, జిందాల్‌ స్టీల్‌, బీహెచ్‌ఈఎల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, బీపీసీఎల్‌ తదితర షేర్లు నష్టాలను ఎదుర్కొన్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 62.52 ఉంది.