నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

69uwbtjvస్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ల నెగెటివ్ ట్రెండ్ ట్రేడింగ్ ను ప్రభావితం చేస్తోంది. అటు ఇవాళ ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షను ప్రకటించనుండటంతో ఇన్వెస్టర్లు వేచిచూసే చూసే ధోరణి అవలంభిస్తున్నారు. దీంతో ప్రస్తుతం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్… 90 పాయింట్లకుపైగా నష్టంతో 28 వేల 100 వద్ద ట్రేడవుతోంది. అటు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 30 పాయింట్లపైగా నష్టంతో 8 వేల 510 వద్ద ట్రేడవుతోంది.