*నాగసానిపల్లి ప్రాథమిక పాఠశాలకు టీవీ వితరణ*

శ్రీరంగాపురం:జులై 21(జనంసాక్షి)

శ్రీరంగాపురం మండలం నాగసానిపల్లి గ్రామంలో గ్రామస్తులు అందరూ కలిసి ప్రాథమిక పాఠశాల టీవీని వితరణ ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి స్థానిక సర్పంచ్ ఆంజనేయులు నాయుడు గారు మాట్లాడుతూ మారుతున్న కాలానుగుణంగా విద్యార్థులకు డిజిటల్ పాఠాలు అందించాలని ఉదేశ్యం తో విద్యార్థుల తల్లిదండ్రులుకొంత డబ్బును సేకరించి పాఠశాలకు టీవీని వితరణ చేయడం జరిగింది. ఈ సదవకాశాన్ని ఉపాధ్యాయులు ఉపయోగించుకొని విద్యార్థులకు చక్కటి  డిజిటల్ పాఠాలు బోధించాలని, విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని పేర్కొంటూ అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులను అందరినీ అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి వెంకటేశ్వర్ రెడ్డి గారు, చిన్న రాములు గారు, ప్రదీప్ కుమార్ గారు, పాఠశాల SMC చైర్మన్ విష్ణువర్ధన్ నాయుడు గారు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొనడం జరిగింది.