నాయనమ్మను కొట్టిన మనవడివై కేసు నమోదు చేసిన పోలీసులు
పెద్దేముల్ సెప్టెంబర్ 02 (జనం సాక్షి)
పెన్షన్ డబ్బులు ఇవ్వాలని లేకుంటే చంపుతానని సొంత నాయనమ్మనే బెదిరించి, కొట్టిన సంఘటన పెద్దేముల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామానికి చెందిన యశోదమ్మ అనే వృద్ధురాలు (70) ఆమె మనుమడు గోవర్ధన్ తాగిన మైకంలో ఉద్దేశపూర్వకంగానే తాగడానికి డబ్బులు కావాలని పెన్షన్ డబ్బులు ఇవ్వాలని లేకుంటే చంపుతానని బెదిరించి ఆమెను కొట్టి ఆమె దగ్గర ఉన్నటువంటి 2000 రూపాయలను బలవంతంగా లాక్కున్నాడని తెలిపారు. ఇట్టి విషయంలో నరేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్ 114/2022 , 386 324 504 506 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు నమోదు చేయడం జరిగిందని పెద్దేముల్ ఎస్సై అబ్దుల్ రవూఫ్ తెలిపారు.