నారాయణఖేడ్ పట్టణంలో తిరంగా ర్యాలీ లో పాల్గొన్న శాసనసభ్యులు ఎం భూపాల్ రెడ్డి

నారాయణఖేడ్ ఆగస్టు13(జనంసాక్షి)
భారత దేశ స్వరాజ్యపాలన75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా అజాది కా అమృత్ మహాత్స వ్ లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్  పిలుపుమేరకు నిర్వహిస్తున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా నారాయణఖేడ్ పట్టణంలో నిర్వహించిన తిరంగా ర్యాలీలో పాల్గొన్న నియోజకవర్గ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి ఇందులో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు75 మీటర్ల జాతీయ జెండా ప్రదర్శించారు. అలాగే ఐకెపి ఉద్యోగులు బతుకమ్మలను ప్రదర్శించారు. ఈ ర్యాలీ స్థానిక తహసిల్ మైదానంలో ప్రారంభమై రాజీవ్ చౌరస్తా నుండి బసవేశ్వర చౌరస్తా వరకు, అక్కడి నుండి మళ్లీ తహసిల్ మైదానం వరకు సాగింది. ఈ ర్యాలీ లో పట్టణంలోని అన్నీ పాఠశాలల విద్యార్థులు, అన్ని డిపార్ట్మెంట్ ల ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు మరియు నాయకులు పాల్గొన్నారు.