నాలుగో టెస్టులో అశ్విన్ హవా
వాంఖడేలో భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్లో తొలిరోజు టీమిండియా స్పిన్నర్ రవిచందన్ అశ్విన్ హవా కొనసాగింది. ఇటీవలి కాలంలో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న అశ్విన్ మరో సారి తన మాయ చేశాడు. వెంట వెంటనే వికెట్లు తీస్తూ ప్రత్యర్థి జట్టును కోలుకోలేని దెబ్బకొట్టాడు. శతకం, అర్ధ శతకాలతో ఇంగ్లాండ్ను ఆదుకొన్న జెన్నింగ్స్ (112), మొయిన్ అలీ (50)ని ఒకే ఓవర్లో పెవిలి యన్కు పంపించి మ్యాచ్పై కోహ్లీసేన పట్టుబిగిం చేలా చేయడంతో తొలి రోజు ఆటముగిసే సరికి ఇంగ్లీష్ జట్టు 288/5 స్కోరుకు చేరుకుంది. రెండో రోజు, శుక్రవారం పిచ్పై బంతి తిరగడం ప్రారంభమైతే స్పిన్నర్లు మరింత చెలరేగే అవ కాశం లేకపోలేదు.