నా కాన్వాయ్‌తో జనానికి ఇబ్బంది కలగొద్దు

` అధికారులకు రేవంత్‌రెడ్డి హుకుం
హైదరాబాద్‌(జనంసాక్షి): సిఎం కాన్వాయ్‌ వెళ్తున్న సమయంలో సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలుగ రాకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి సూచించారు. సిఎం కాన్వాయ్‌ లోని 15 వాహనాలను 9 వాహనాలకు తగ్గించామని, తానూ ప్రయాణించే మార్గంలో ట్రాఫిక్‌ జామ్‌ లు లేకుండా, ట్రాఫిక్‌ ను నిలిపివేయకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని పోలీస్‌ అధికారులకు సూచించారు. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి విస్తృత స్థాయిలో పర్యటనలను చేయాల్సి ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో తానూ ప్రయాణించే మార్గంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఏవిధమైన  చర్యలు తీసుకోవాలో సూచించాలని పోలీస్‌ అధికారులను సి.ఎం  కోరారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా, ఇంటిలో కూర్చోవడం తనకు సాధ్యం కాదన్నారు