నియోజకవర్గ పరిధిలోని ప్రధాన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కారం

కాలనీలలో నెలకొన్న    ప్రధాన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కారం చేయడం జరుగుతుంది అని ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి  తెలిపారు. వనస్థలిపురం డివిజన్ లో దాదాపు ఒక కోటి 78 లక్షల 50 వేల రూపాయల వ్యయంతో చేపట్టిన నూతన అభివృద్ధి పనులకు  ముఖ్య అతిథిగా ఎల్.బి.నగర్ శాసనసభ్యులు .దేవిరెడ్డి సుదీర్ రెడ్డి  శంకుస్థాపన చేశారు.దానిలో భాగంగా
నాగార్జున నగర్ కాలనీతో పాటు వివిధ కాలనీలతో పాటు సీ.సీ.రోడ్డు, యూ.జీ.డి పనులకు శంకుస్థాపన.అంచనా వ్యయం:79.30 లక్షలు,ఓంకార్ నగర్ నందు కమ్యూనిటి హాల్ పనులకు శంకుస్థాపన.అంచనా వ్యయం 37.20 లక్షలు,వెంకటరమణ కాలనీ నందు సీ.సీ.రోడ్డు పనులకు శంకుస్థాపన.అంచనా వ్యయం:18.50 లక్షలు,సుష్మా థియేటర్ ఏ టైప్ క్వాటర్స్ దగ్గర పార్క్ నందు ఇతర సదుపాయాలు.అంచనా వ్యయం:43.50 లక్షల పనులకు శంకుస్థాపన చేశారు సందర్భంగా సుధీర్ రెడ్డి  మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని ప్రధాన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కారం చేయడం జరుగుతుంది అని తెలిపారు.నియోజకవర్గ అభివృద్దే తన లక్ష్యం అని తెలిపారు.ఇ కార్యక్రమంలో , నాయకులుచాపల శ్రీనివాస్ యాదవ్ , స్ఫూర్తి సేవా సమితి అధ్యక్షులు  కొలిశెట్టి సంజయ్ కుమార్ ,మధు గౌడ్,జైపాల్,అరుణ్,లత,ఆనంద్ రాజ్,సంతోష్,రమేష్,పద్మ,జీ.హెచ్.ఏం.సీ.ఏ.ఈ.ప్రజ్ఞ  పలు కాలనీ అధ్యక్ష,కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు