నియోజకవర్గ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన అయోధ్య చారి

పినపాక నియోజకవర్గ ప్రతినిధి అక్టోబర్ 23 (జనం సాక్షి): పినపాక నియోజకవర్గం లోని ప్రజలందరికీ సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొల్లోజు అయోధ్య చారి దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నిండాలని ఆయన ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా దీపావళి జరుపుకోవడం మన సంప్రదాయం అన్నారు. ధన సమృద్ధికి సంకేతమైన లక్ష్మీదేవిని పూజించడం, కేదారేశ్వరి వ్రతం చేయడం కూడా దీపావళి పండుగ విశిష్టత అన్నారు. ప్రజలందరూ పండుగను కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని, పటాసులు కాల్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.