నిరుద్యోగ సమస్య పైన యువత ఉద్యమించా ఏఐవైఎఫ్ జిల్లా చిలక రాజు శ్రీను

రడుచర్ల( జనంసాక్షి)న్యూస్ జూలై 07 : రోజు రోజుకు నిరుద్యోగ సమస్య పెరుగుతుందని నిరుద్యోగ సమస్య పైన యువత ఉద్యమించాలని అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు చిలకరాజుశ్రీను అన్నారు.గురువారం నాడు బోడల్ దిన్న గ్రామంలో జరిగిన ఏఐవైఎఫ్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ భగత్ సింగ్, రాజ్ గుర్, సుఖ్ దేవ్ లాంటి స్వతంత్ర సమరయోధుల స్ఫూర్తి తో వారి ఆశయ సాధన కోసం ఏర్పడిన అఖిల భారత యువజన సమాఖ్య ఆ వైపున ఉద్యమిస్తుందని అన్నారు.తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన యువతకు  నీళ్లు,నిధులు,నియామకాలు వంటి హామీలతో గద్దె నెక్కిన ఈ ప్రభుత్వం  నియామకాలు, నోటిఫికేషన్ ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న  ప్రజా వ్యతిరేక విధానాలపై నేటి యువత,విద్యార్థి  సంఘాలు ఉద్యమించాలి అన్నారు.ఈ సమావేశంలో  ఏఐ వైఎఫ్ నాయకులు యల్లబోయిన శివ,మల్లెపూల సతీష్,మండల నవీన్,రేఖ ఉపేందర్,రావుల శివ, తదితరులు పాల్గొన్నారు.
Attachments area