నిరుపేద కుటుంబానికి లక్ష యబ్భై వేల రూపాయల LOC అందజేత…
దూల్మిట్ట( జనం సాక్షి )ఆగస్టు: 14 జనగామ నియోజకవర్గ పరిధిలోని సిద్దిపేట జిల్లా దూల్మిట మండలం కూటిగల్ గ్రామానికి చెందిన చెప్యాల నర్సింలు గారు డెంగ్యూ మరియు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా వారి కుటుంబం పేద కుటుంబం కావడంతో వారి బంధువులు టీఅర్ఎస్ రాష్ట్ర నాయకుడు నాగపూరి కిరణ్ కుమార్ గారిని సంప్రదించి విషయం తెలుపగా వెంటనే స్పందించిన కిరణ్ కుమార్ గారు లక్ష యబ్భై వేల రూపాయల LOC మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేయడం జరిగింది. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నాగపూరి కిరణ్ కుమార్ గారికి వారి కుటుంబం ఎల్లవేళలా రుణపడి ఉంటామని తెలిపారు
