నిరుపేద కుటుంబాల అభ్యున్నతికే దళితబంధు :ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి

జోగులాంబ గద్వాల బ్యూరో చీఫ్ (జనంసాక్షి) జూలై 19 :  గద్వాల పట్టణంలో 3వ వార్డ్ చెందిన  శ్రీమతి భాగ్యమ్మ  దళిత బంధు లబ్ధిదారులకు  ఎంపికైన అయినా భాగ్యమ్మను 10 లక్షల వ్యయంతో  భాగ్యమ్మ  మిని సూపర్ బజార్ మంజూరైన యూనిట్ ని గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమెహన్ రెడ్డి చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు.ఈ సంధర్బంగా  లబ్ధిదారులు  ఎమ్మెల్యేకి పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.
ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి మాట్లాడుతూ….
గతంలో ఏ ప్రభుత్వాలు చేయలేని విధంగా నేడు తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ దళితుల కోసం దళిత బంధం ప్రవేశపెట్టడం జరిగినది.దళితులను కేవలం ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే గత ప్రభుత్వాలు ఉపయోగించుకున్నారు వారికి ఎలాంటి పథకాన్ని ప్రవేశపెట్టి లేదు  వారి అభివృద్ధి కొరకు ఎలాంటి కృషి చేయలేదు అన్నారు‌.ప్రపంచంలో ఏ ప్రధానమంత్రికి ఏ ముఖ్యమంత్రి కి రాని  ఆలోచనం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ రావడం జరిగింది దళితులను కూడా ఆర్థికంగా ఎదగాలని  దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టి దళితులు ఆర్థికంగా ఎదగాలి దళితులు కూడా నలుగురికి ఉపాధి కల్పించే విధంగా ఉండాలని దళితులు గతంలో ఓట్లు వేసే యంత్రాలుగా ఉపయోగించుకున్నారు తప్ప వారికి ఏమాత్రం కూడా ఇలాంటి ఆర్థిక సంబంధించిన పథకాలను గాని ప్రయోజనాలు గాని పెట్టలేదు తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ దళితుల కోసం ప్రత్యేకంగా దళిత బంధు, అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళితుల మహిళలకు కుట్టుమిషన్లు, కుటీర పరిశ్రమలకు సంబంధించిన పరికరాలను అందజేస్తూ వారికి అన్నివిధాలుగా అండగా నిలిచి నాయకుడు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
దళితులు కూడా ఆత్మ ధైర్యంతో బతికేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితులకు అన్నివిధాలుగా అండగా నిలిచిన నాయకుడు సీఎం కేసీఆర్ అని అన్నారు.
భవిష్యత్తులో  దళిత బంధు ద్వారా ప్రతి ఒక్క దళిత బిడ్డ అభివృద్ధి చెందాలని ఆర్థికంగా ఎదగాలని అన్నది  ప్రభుత్వ  లక్ష్యం అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ సరోజమ్మ, ఎంపీపీ ప్రతాప్ గౌడ్, జెడ్పీటీసీ రాజశేఖర్,ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేష్ బాబు,కౌన్సిలర్స్ గీతమ్మ  ,దౌలు, కృష్ణ, మహేష్,గద్వాల టౌన్ పార్టీ అధ్యక్షుడు గోవిందు, ప్రధాన కార్యదర్శి సాయి శ్యామ్ రెడ్డి, ఉపాధ్యక్షుడు ధర్మనాయుడు, తెరాస పార్టీ నాయకులు జంబు రామన్ గౌడ్,  నాగులు యాదవ్, రామకృష్ణ శెట్టి, భగీరథ వంశీ , కృష్ణ,వీరేష్, చిన్న, నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.