నిరుపేద వరుడికి ఆర్థిక సహాయం అందజేత.

దౌల్తాబాద్ మండల పరిధిలోని గొడుగుపల్లి గ్రామం లో నిరుపేద కుటుంబానికి చెందిన కర్రే లక్ష్మి, రాములు కుమారుడు చింటు వివాహానికి ఎం.జే.బి ట్రస్ట్ వ్యవస్థాపకులు, బి.ఆర్.ఎస్ రాష్ట్ర నాయకులు మద్దుల నాగేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు ట్రస్ట్ బాధ్యులు స్వామిగౌడ్ తో 5000/వేల ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ దుబ్బాక
నియోజకవర్గంలో ప్రజా సేవ చేయడం సంతృప్తినిస్తుందని అన్నారు.నాగేశ్వర్ రెడ్డి కష్టపడి సంపాదించిన దాంట్లో కొంత సమాజ సేవకు వినియోగించడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల అవసరాన్ని తెలుసుకుంటూ ప్రజలకు అందుబాటులో జీవన కొనసాగించడం తనకు ఎంతో సంతోషంగా ఉంటుందన్నారు.ఈ కార్యక్రమం లో రుక్మేందర్,రాజు,సాయిలు,స్వామి తదితరులు పాల్గొన్నారు.