నీటి ఉధృతి పరిశీలించిన: మంత్రి కొప్పుల ఈశ్వర్..

ధర్మపురి ( జనం సాక్షి )జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణం మంగళి గడ్డ ప్రాంతం గోదావరి నది లో పెరుగుతున్న నీటి ఉధృతి పరిశీలించి, గోదావరి నది లో నాణాలను వేసి,సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ పైన కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నుండి వస్తున్న గోదావరి నీటి ఉధృతి పెరిగింది, కావున ధర్మపురి కేంద్రానికి వస్తున్న భక్తులు, పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు, పోలీస్ సహ ప్రభుత్వ యంత్రాంగం నిమగ్నమైంది ఉండాలని, ఎవరు నది తీరాన వెళ్లకుండా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో డి సి ఎం ఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సత్తేమ్మ, బత్తిని అరుణ ఎడ్ల చిట్టిబాబు, అయ్యోరి రాజేష్ తదితరులు పాల్గొన్నారు