నీటి కుంటలో పడి ఇద్దరు మృతి
జనంసాక్షి /పాపన్నపేట ఆగస్టు 28 నీటి కుంటలో పడి ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన మండలంలోని కొడుపాక గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది.ఎస్ఐ విజయ్ కుమార్ కథనం మేరకు… కొడుపాక గ్రామానికి చెందిన పోతుల రాము (21), కొల్చెల్మ నాగరాజు(21)లు ఇదే గ్రామానికి చెందిన మరో మిత్రుడు చిట్టెమ్మ కిష్టయ్యతో కలిసి శనివారం ఉదయం ఎల్లరి గడ్డల కోసం గ్రామ శివారులోనీ అటవీ ప్రాంతానికి వెళ్లారు.ఈ క్రమంలో నాగరాజు, రాము ఇద్దరు స్నానం చేయడానికి గ్రామ శివారులో ఉన్న కొత్త కుంటలోకీ దిగి నీటిలో మునిగిపోయారు.ఇద్దరు మునిగి పోవడంతో మరో యువకుడు కిష్టయ్య భయంతో పారిపోయాడు.ఆదివారం ఉదయం ఇద్దరి కోసం వేతుకుతుండగా కుంట వద్ద కట్టెల మోపు, సంచి, దుస్తులు, కనిపించాయి.దీంతో కుంటలో గాలించి ఇద్దరు మృతదేహాలను వెలికి తీశారు.స్థానిక ఎస్ఐ విజయ్ కుమార్ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.