నీలి నాలుక వ్యాధి నివారణకు ఈ టీకాలు

కౌడిపల్లి (జనంసాక్షి).గొర్రెలలో నీలి నాలుక వ్యాధి నివారణకు ముందు జాగ్రత్తగా ఈ -టీకాలు వేస్తున్నట్లు కౌడిపల్లి పశువైద్యదికారి డాక్టర్ రాజు తెలిపారు.బుధవారం మండల పరిధిలోని దేవులపల్లి మరియు తండాల్లో గల గొర్రెలకు ఈ- టీకాలు ఇచ్చామని తెలిపారు. జులై 18 నుంచి 28 వరకు కౌడిపల్లి మండలం లోని అన్ని గ్రామాలు,తాండలలో పర్యటించి టీకాలు ఇస్తామని రాజు అన్నారు.ఈ వ్యాధి సోకిన జీవాలు తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ మేత మేయక నీరసించి చనిపోయే అవకాశం కూడా ఉందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో జెవిఓ కృష్ణ కుమార్,ఎల్ యెస్ ఏ వీరారెడ్డి ,పశువైద్య సహాయకులు చెన్నయ్య, రైతులు పాల్గొన్నారు.