నూతనంగా నిర్మిస్తున్న బరోసా కేంద్రం ను పరిశీలించిన జిల్లా అదనపు ఎస్పీ ఎన్ .రవి.

నూతనంగా నిర్మిస్తున్న బరోసా కేంద్రం ను పరిశీలించిన జిల్లా అదనపు ఎస్పీ ఎన్ .రవి.

గద్వాల నడిగడ్డ సెప్టెంబర్ 27 జనం సాక్షి.
నిర్మాణము లో వున్న బరోసా కేంద్రం నకు సంబంధించి మిగిలిన పనులను నవంబర్ 15 తేది నాటికి పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచాలని జిల్లా అదనపు ఎస్పీ ఎన్. రవి బరోసా బిల్డింగ్ ఇంజనీర్ ను అదేశించారు.జిల్లా కేంద్రం లోని బీమ్ నగర్ లో మెయిల్ కంపెనీ సహకారం తో నూతనంగా నిర్మిస్తున్న బరోసా కేంద్రం ను అదనపు ఎస్పీ సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు.ఇంకా పూర్తి చేయాల్సిన పనులు తదితర వివరాలను మెయిల్ కంపెనీ అధికారి జిల్లా అదనపు ఎస్పీ కి వివరించారు.ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ లైంగిక వేదింపులకు గురైన బాధిత మహిళలకు సైకలాజికల్ కౌన్సెలింగ్, వైద్య , న్యాయ సపోర్ట్ లను ఒకే గొడుగు కింద అందించే బరోసా కేంద్ర నిర్మాణ పనులు నవంబర్ 15 తేది నాటికి పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచాలని అదనపు ఎస్పీ సూచించారు.ఈ కార్యక్రమలో అదనపు ఎస్పీ వెంట సాయుధ దళ డి. ఎస్పీ ఇమ్మనియోల్, ఎస్సై రమా దేవి, బరోసా కో ఆర్డినేటర్ శివాని, ఇంజనీర్ పుష్కర్ ఉన్నారు.