నూతన ఆసరా పెన్షన్ లను పంపిణీ చేసిన దోసపల్లి సర్పంచ్
జనంసాక్షి/రేగోడ్
రేగోడు మండల పరిధిలోని దోసపల్లి గ్రామంలో శుక్రవారం నాడు 57సంవత్సరాలు నిండిన లబ్దిదారులకు సర్పంచ్ విజయలక్ష్మీగురునాథ్ రెడ్డి చేతులమీదుగా పింఛన్ పత్రాలను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 57 సంవత్సరాలకే
ఆసరా పెన్షన్లు మంజూరు చేసిన సందర్భంగా కేసీఆర్,మరియు స్థానిక ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గ్రామంలో 17 మందికి నూతన పెన్షన్లు మంజూరు కావడం చాలా సంతోషంగా ఉందని సర్పంచ్ అన్నారు.ఈ కార్యక్రమంలో రేగోడు మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బుచ్చయ్య,గ్రామ తెరాస పార్టీ అధ్యక్షుడు రామకృష్ణ రెడ్డి,సీనియర్ నాయకులు అమరసింహ రెడ్డి,ఉప సర్పంచ్ సుశీలరామయ్య,
వార్డు మెంబెర్ బాగయ్య,మంగలి అంజయ్య,హరికిషన్,గ్రామప్రజలు తదితరులు పాల్గొన్నారు.