నూతన వధువు వరులను ఆశీర్వదించిన గీతారెడ్డి, నరోత్తం

ఝరాసంగం ఆగస్టు 26 (జనంసాక్షి)ఝరా సంగం మండల పరిధిలోని బొప్పన్ పల్లి గ్రామంలో జరిగిన ఉప సర్పంచ్ అమృత్ కుమారుని వివాహ కార్యక్రమంలో పాల్గొన్న మాజీమంత్రి వర్యులు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంచార్జ్ కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్.
డా.జె. గీతారెడ్డి టి పి సి సి నాయకులు వై. నరోత్తం లు పాల్గొని నూతన వధువు వరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ అమృత్ వారికి శాలువ తో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు హన్మంతరావు పాటిల్, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు, పి.నర్సింహారెడ్డి, జడ్పిటిసి వినీల నరేశ్, జిల్లా యువజన కాంగ్రెస్ అద్యక్షులు ఉదయ్ శంకర్ పాటిల్, బాలన్న, అద్వికెట్ షకీల్ అహ్మద్, మల్లికార్జున్,నగేష్,రవి స్వామి, సుధాకర్ రెడ్డి, చి ఎచ్ దత్తు, తదితరులు పాల్గొన్నారు.