నేటి తరం నాయకులకు ఆయన ఆదర్శం
– టీడీపీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి
న్యూడిల్లీ, ఆగస్టు17(జనం సాక్షి ) : భారత ప్రజలకు సుపరిపాలన అందించిన గొప్ప నాయకుడు వాజ్పేయి అని టీడీపీ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి అన్నారు. నేటి తరం నాయకులకు ఆయన ఆదర్శమని అన్నారు. వాజ్పేయికి తెలుగు రాష్ట్రాలతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు. తాను రాజకీయంలోకి రాకముందే వాజ్పేయి నిర్వహించిన రెండు, మూడు విూటింగ్లలో పాల్గొన్నానని చెప్పారు. ఆయనొక గొప్ప వ్యక్తి అని, అహర్నిశలు కష్టపడి చక్కగా పరిపాలించారని కొనియాడారు. సంకీర్ణ ప్రభుత్వంలో ఐదేళ్లు చక్కగా పాలించి, భారత దేశాన్ని ముందుకు తీసుకువళ్లారని అన్నారు. నేడు ఆయన మన మధ్య లేకపోవడం దేశానికి తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతికలగాలని మనసారా కోరుకుంటున్నానని సుజనా చౌదరి అన్నారు.