నేడు ఉచిత కంటి వైద్య శిభిరం

జిల్లా కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘ కార్యాలయంలో నేడు ఉచిత కంటి వైద్య శిభిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఆ సంఘం సూర్యాపేట మండల అధ్యక్ష , కార్యదర్శులు దండ శ్యాంసుందర్ రెడ్డి , ఎస్.నాగేశ్వరరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.శరత్ మ్యాక్సీ విజన్ లేజర్ కంటి హాస్పిటల్  వారి సౌజన్యంతో ఈ వైద్య శిభిరాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.ఈ వైద్య శిభిరంలో భాగంగా వైద్య పరీక్షలు నిర్వహించి , అవసరమైన వారికి ఆపరేషన్లు చేయనున్నట్లు తెలిపారు.పెన్షనర్లు తమ హెల్త్ కార్డ్ ను తీసుకురావాలని తెలిపారు.ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించే ఈ వైద్య శిభిరాన్ని పెన్షనర్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు