నేడు కార్యాచరణ ప్రకటిస్తా: అళగిరి

చెన్నై,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): తిరిగి డీఎంకేలోకి రావడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్న కరుణానిధి పెద్ద కుమారుడు ఎంకే అళగిరి తన భవిష్యత్తు కార్యాచరణను ఈ నెల 5వ తేదీన వెల్లడిస్తానని పేర్కొన్నారు. ముందుగా వెల్లడించినట్లే ఈ నెల 5న చెన్నైలో శాంతియుత ర్యాలీ నిర్వహిస్తామన్నారు. ఇందులో దాదాపు లక్షమంది పాల్గొంటారని చెప్పారు. స్టాలిన్‌ను పార్టీ అధ్యక్షుడిగా అంగీకరిస్తానని బహిరంగంగా వెల్లడించానని గుర్తుచేశారు. ఈనెల ఐదులోపు అటు నుంచి స్పందన రాకుంటే తన భవిష్యత్తు కార్యాచరణను వెల్లడిస్తానని చెప్పారు. ఇప్పటికే వివిధ వ్యాఖ్యలతో రాజకీయ వేడి పుట్టించిన ఆయన పరిస్థితులకు అనుగుణంగా స్వరం కూడా తగ్గించారు. ఈ నేపథ్యంలో ర్యాలీ నిర్వహిస్తారా ? లేదా? అనే అంశంపై ఆదివారం మాట్లాడుతూ… తాను కరుణానిధి కుమారుడని, చెప్పినట్లే ర్యాలీ ఉంటుందని స్పష్టం చేశారు. అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అందులో భాగంగానే ఆయన చెన్నైకి వచ్చారని తెలిసింది.