నేడు జయహో జహీరాబాద్ పాదయాత్ర,ప్రారంభం
జహీరాబాద్ జులై 28 (జనంసాక్షి) జహీరాబాద్ నియోజకవర్గంలో ని ఐదు మండలాలలో నేటి నుండి జయహో జహీరాబాద్ ఢిల్లీ వసంత్ పాదయాత్ర ప్రారంభించనున్నారు.గురువారం పాదయాత్ర సీడీ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఢిల్లీ వసంత్ మాట్లాడుతూ జహీరాబాద్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టడమే నా లక్ష్యం అన్నారు. నేటి నుంచి జయహో జహీరాబాద్ నినాదంతో నియోజకవర్గ పాదయాత్ర ప్రారంభించనున్నాట్లు తెలిపారు, “జనతా జనార్ధన్ – ప్రజలే దేవుళ్ళు” అనే స్ఫూర్తితో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల సామాజిక, ఆర్థిక, అంశాలపై అధ్యయనం చేయుటకు 90 రోజుల సుదీర్ఘ ప్రణాళికతో 1000 కిలోమీటర్లు పైగా మా పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలియజేశారు. 15 సంవత్సరాల క్రితం చలో ఢిల్లీ పిలుపుతో రైతుల ఆత్మహత్యలపై 2140 కిలోమీటర్లు పాదయాత్ర తో దేశ రాజకీయాలను ప్రభావితం చేసి 70 వేల కోట్ల రుణమాఫీ కారణమైన స్ఫూర్తితో నేటి దినం జూలై 29 నుండి పాదయాత్ర ప్రారంభించడం జరుగుతుంది అన్నారు. స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఉదయం 11 గంటలకు ఈ యాత్ర ప్రారంభించడానికి, ముఖ్య అతిథులుగా తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ కార్యదర్శి శ్యాం ప్రసాద్ రెడ్డి, ఇంజనీర్ల బృందం రానుంది అన్నారు. ఇప్పటికే సీనియర్ జర్నలిస్ట్ దుర్గం రవీందర్ ఆధ్వర్యంలో విలేజ్ మోనోగ్రఫీల తయారీపై అధ్యయనం ప్రారంభమయింది అన్నారు, జహీరాబాద్ సర్వతోముఖభివృద్ధికై ఇప్పటికే సిబిఐ మాజీ జేడీ వి.వి. లక్ష్మీనారాయణ చేతుల మీదుగా మేనిఫెస్టో విడుదల చేశారు అన్నారు, తన ఇరవై సంవత్సరాల సామాజిక సేవను జహీరాబాద్ ప్రజలు గుర్తించాలని, ఎమ్మెల్యే గెలిపిస్తే రైతులకు, యువతకు, మహిళలకు, కార్మికులను అభివృద్ధి పథంలో నడిపిస్తానని అందుకోసమే ఆర్థిక సాధారణ సాధికారిత సదస్సులను నిర్వహించానని ఆయన గుర్తు చేశారు, జహీరాబాద్ అభివృద్ధే లక్ష్యంగా జయహో జహీరాబాద్ అనే పాటల ఆల్బంన్ని ఆవిష్కరించామని ఆయన తెలియజేశారు,ఈ కార్యక్రమంలో ఢిల్లీ వసంత్ బృదం సభ్యులు జనార్దన్, స్టీవెన్ బాబు, మాధవ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.